Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను నిరాకరించిందనీ నిప్పుపెట్టిన సైకో లవర్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (08:57 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో శనివారం తెల్లవారుజాను ఓ భవనంలో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదం విద్యుదాఘాతం వల్లే సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం వెల్లడైంది. 
 
ఆ భవనంలో నివసించే ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందనందుకుగాను ఓ యువకుడి భవనానికి నిప్పుపెట్టినట్టు తేలింది. ఈ కిరాతక చర్యకు పాల్పడిన సైకోను శుభం దీక్షిత్ (27)గా గుర్తించారు. శనివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న ఈ యువకుడు అక్కడ పార్క్ చేసిన స్కూటర్‌కు నిప్పుపెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో చెలరేగి అక్కడ పార్క్ చేసిన ఇతర వాహనాలకు అంటుకున్నాయి. అక్కడ నుంచి భవనానికి వ్యాపించాయి. 
 
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అందులోని కొందరు కిందకు దూకి ప్రాణాలు కోల్పోగా ఐదుగురు మాత్రం మంటల్లో కాలిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరంపై స్థానిక పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments