మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. శరద్ పవార్‌కు ప్రేమలేఖ

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (14:42 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు రాత్రి ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు ఐటీ తాఖీదుల రూపంలో ప్రేమ లేఖ పంపించారు. ఈ విషయాన్ని శరద్ పవర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ముఖ్యమంత్రి షిండేగా ప్రమాణం చేయగానే తనకు ప్రేమలేఖ అందిందంటూ పవార్ ట్వీట్ చేశారు.
 
గత 2004, 2009, 2014, 2019 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లకు సంబంధించిన ఐటీ శాఖ నుంచి తనకు ప్రేమలేఖ అందిందని చెప్పారు. కొందరు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని, అఫిడవిట్లకు సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని చెప్పారు.
 
అలాగే, హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో ముఖ్యమంత్రి పీఠం కోసం ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపారంటూ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ గట్టిగానే కౌంటరిచ్చారు. హిందుత్వ సిద్ధాంతం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయలేదని కేవలం అధికారం కోసమే తిరుగుబాటు చేశారంటూ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments