ముర్ము ఇంటికి ప్రధాని మోడీ.. కొత్త రాష్ట్రపతికి స్వీట్లు తినిపించిన అమిత్ షా

Webdunia
గురువారం, 21 జులై 2022 (22:15 IST)
భారత రాష్ట్రపతిగా అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే తన సమీప ప్రత్యర్థి విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో ముర్ము విజయం సాధించారు.
 
మరోవైపు, రాత్రి 8 గంటల సమయంలోనే ముర్ము తన విజయానికి సరిపడ మేర ఓట్లను సాధించారన్న సమాచారం తెలియాగనే ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఆమె నివాసానికి వెళ్ళారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ జాతీయ చీఫ్ నడ్డాతో కలిసి ముర్ముకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ముర్ము వ్యక్తిత్వాన్ని, విజయాన్ని ఆకాశానికెత్తిన ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు ఓటు వేసిన ప్రజా ప్రతినిధులకు అభినందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
 
ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అక్కడకు వచ్చి ముర్ముకు అభినందలు తెలిపారు. తన చేతులతో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‍‌నాథ్ సింగ్ కూడా అక్కడకు చేరుకుని ముర్ముకు అభినందనలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments