Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముర్ము ఇంటికి ప్రధాని మోడీ.. కొత్త రాష్ట్రపతికి స్వీట్లు తినిపించిన అమిత్ షా

Webdunia
గురువారం, 21 జులై 2022 (22:15 IST)
భారత రాష్ట్రపతిగా అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే తన సమీప ప్రత్యర్థి విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో ముర్ము విజయం సాధించారు.
 
మరోవైపు, రాత్రి 8 గంటల సమయంలోనే ముర్ము తన విజయానికి సరిపడ మేర ఓట్లను సాధించారన్న సమాచారం తెలియాగనే ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఆమె నివాసానికి వెళ్ళారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ జాతీయ చీఫ్ నడ్డాతో కలిసి ముర్ముకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ముర్ము వ్యక్తిత్వాన్ని, విజయాన్ని ఆకాశానికెత్తిన ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు ఓటు వేసిన ప్రజా ప్రతినిధులకు అభినందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
 
ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అక్కడకు వచ్చి ముర్ముకు అభినందలు తెలిపారు. తన చేతులతో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‍‌నాథ్ సింగ్ కూడా అక్కడకు చేరుకుని ముర్ముకు అభినందనలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments