Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుకు మత్తుమందిచ్చి... రోజుకు పది మంది చొప్పున అత్యాచారం..

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నవ వధువును ఉద్యోగం పేరుతో నాలుగు రోజుల పాటు గదిలో బంధించి రోజుకు పది మంది చొప్పున 40 మంది అత్యాచారం జరిపారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించ

Webdunia
శనివారం, 21 జులై 2018 (10:32 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నవ వధువును ఉద్యోగం పేరుతో నాలుగు రోజుల పాటు గదిలో బంధించి రోజుకు పది మంది చొప్పున 40 మంది అత్యాచారం జరిపారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
 
హర్యానా రాష్ట్రంలోని పంచకుల జిల్లాలోని మోర్నీ ప్రాంతానికి చెందిన 22 యేళ్ళ యువతికికి ఇటీవల వివాహమైంది. ఆ తర్వాత ఆమె భర్తకు తెలిసిన వ్యక్తి ఒకరు వచ్చి మీ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అతని వెంట భార్యను పంపించాడు. ఆమెను నాలుగు రోజుల పాటు బంధించి, మత్తుమందులిచ్చి 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
దీనిపై ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గెస్ట్‌లో ఉన్న బాధిత యువతిని రక్షించారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు వెళ్లిన ఆమె, బుధవారం 18 వరకూ తిరిగి రాలేదు. ఆమెను నాలుగు రోజుల పాటు అక్కడే బంధించారు. మత్తుమందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. రోజుకు 10 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments