Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దున్నే ఆలస్యంగా నిద్ర లేస్తున్నాడనీ కొడుకుని కాల్చి చంపిన మాజీ జవాను

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (09:36 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నబిడ్డను ఓ మాజీ జవాను కాల్చి చంపాడు. అదీకూడా చిన్నపాటి విషయానికే. రోజూ ఉదయాన్నే ఆలస్యంగా నిద్ర లేస్తున్నాడనీ ఆగ్రహించిన మాజీ జవాను అయిన తండ్రి తుపాకీతో కాల్చి చంపాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీకి చెందిన టికలీటోలీ నివాసి రాకేష్ రావత్ అనే వ్యక్తి జవానుగా పని చేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు. ఈయనకు రాహుల్ (29) అనే కుమారుడు ఉన్నాడు. రాహుల్ ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. 
 
దీంతో రాహుల్ ప్రతీరోజూ ఉదయమే లేచి చదువుకోవాలని తండ్రి చెబుతూ వచ్చాడు. అయినా రాహుల్ లేటుగా లేస్తుండటంతో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో కుమారునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి తన లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చి చంపాడు. 
 
బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ జవానును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments