Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామేశ్వరంలో ఇంత దారుణమా? పిండ ప్రదానం చేస్తే తినే కాకులే.. రెస్టారెంట్లలో?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:08 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం వెలసిన రామేశ్వరంలో పర్యాటకులను, ఆ ప్రాంత ప్రజలను కొన్ని రెస్టారెంట్లు మోసం చేస్తున్నాయి. రామేశ్వరంలోని కొన్ని రెస్టారెంట్లు చికెన్ వంటకాల కోసం కోళ్లను కొనకుండా విడిగా మాంసాన్ని కొంటున్నాయి. ఎందుకంటే... కోళ్లను కొంటే వాటిని వండేందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది. అదే చికెన్ కొంటే ఈజీగా వండేయొచ్చు. కానీ రామేశ్వరం రెస్టారెంట్లు మాత్రం చికెన్‌కు బదులు కాకుల మాంసాన్ని కొంటున్నాయి. 
 
చికెన్‌తో పాటూ కాకుల మాంసాన్ని మిక్స్ చేస్తున్నారు. రెస్టారెంట్లకు చికెన్ మాంసం పేరుతో కాకుల మాంసం మిక్స్ చేసిన దాన్ని అమ్ముతున్నారు. రెస్టారెంట్ల యజమానులకు ఈ విషయం తెలియదు కదా. వాళ్లు చికెనే అని కొనేసి... వండేస్తున్నారు. కస్టమర్లు కూడా చికెన్ మాంసమే అనుకొని తినేస్తున్నారు. చివరికి జరగాల్సిన దారుణం జరిగిపోతోంది. 
 
ఈ విషయం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు తెలిసింది. ఉన్నట్టుండి జరిపిన దాడుల్లో 150 కాకులు ఒకేసారి చావడం వెనుక రహస్యాన్ని  కనిపెట్టారు. ఈ దారుణానికి పాల్పడుతున్న ఇద్దర్ని అరెస్టు చేశారు. 150 పక్షుల మాంసాన్ని సీజ్ చేశారు.
 
రామేశ్వరంలో పితృదేవతలు పెడుతున్న పిండంలో లిక్కర్లను కలిపి కాకులు అలా మత్తులో పడిపోతే.. వాటిని చికెన్ షాపులకు అమ్ముతున్నారు. ఆ చికెన్ షాపుల యజమానులు చికెన్ మాంసంలో కాకుల మాంసం కలిపేసి... రెస్టారెంట్లకు అమ్ముతున్నారు. వాటిని జనాలు తెలియకుండా తినేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments