వణికిస్తున్న కరోనా వైరస్... భారత్ సహా 20 దేశాలకు వ్యాప్తి... 13 వేల మందికి నిర్ధారణ

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (10:31 IST)
చైనా దేశంలోని వుహాన్ కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇపుడు మరింతగా వణికిస్తోంది. ఇప్పటికే భారత్ సహా 20 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఫలితంగా 13 వేల మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, మరో 50 వేల మంది రక్తపరీక్షల ఫలితాలు వెల్లడికావాల్సివుంది. ముఖ్యంగా ఈ వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్ నగరంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 
 
కాగా, ఈ వైరస్ సోకినవారిలో ఇప్పటివరకూ రోజుకు 10 నుంచి 20 మరణాలు నమోదుకాగా, గడచిన రెండు రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య రెట్టింపు అయింది. బుధవారం నాటికి 120 మంది మరణించారని అధికారిక లెక్కలు విడుదల చేసిన చైనా, నేడు ఆ సంఖ్య 259కి చేరినట్టు పేర్కొంది. అనధికారికంగా మరో 50 మందికి పైగా కరోనా కారణంగా మృతి చెంది వుంటారని అంచనా.
 
కాగా, ఈ వైరస్ ఇప్పటివరకు భారత్ సహా మొత్తం 20 దేశాలకు వ్యాపించింది. దీంతో అన్ని దేశాల విమానాశ్రయాల్లో విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 
 
ఎయిర్ పోర్టులకు సమీపంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన వివిధ దేశాలు, 14 రోజుల పాటు వారిని అక్కడే ఉంచి, కరోనా లక్షణాలు కనిపించకుండా ఉంటేనే బయటకు పంపించాలని నిర్ణయించారు. ఇదిలావుండగా, చైనా పౌరులకు జారీ చేసే వీసాలపై భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అలాగే, చైనాకు అనేక దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్

Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ

రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

తర్వాతి కథనం
Show comments