Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ హత్య కేసు : ముద్దాయి శాంతన్ విడుదల

వరుణ్
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (15:32 IST)
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన శాంతన్ అనారోగ్యం కారణంగా బుధవారం చెన్నైలో ప్రాణాలు విడిచాడు. కాలేయ సమస్యతో చెన్నైలోని జీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శాంతన్.. బుధవారం ఉదయం చనిపోయారు. ఆయన వయసు 55 యేళ్లు. హత్య కేసులోని ముద్దాయిలందరూ ఇటీవల విడుదలైన విషయం తెల్సిందే. వీరిలో శాంతన్ కూడా ఒకరు. ఈయన తన సొంత దేశమైన శ్రీలంకకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరగా, అందుకు కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది.
 
కాలేయ సమస్యతో అనారోగ్యం పాలైన ఆయన జీహెచ్ ఆస్పత్రిలో చేరకాగ, ఆయనను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు చనిపోయినట్టు వైద్యులు అధికారికంగా వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత ఆయన మృతదేహాన్ని శ్రీలంకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
గత 1991లో రాజీవ్ హత్య కేసులో ఇతర దోషులతో పాటు శాంతన్ జైలుశిక్షను అనుభవించాడు 2022లో సుప్రీంకోర్టు వీరికి జైలు జీవితం నుంచి స్వేచ్ఛను ప్రసాదించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ముగ్గురు దోషులతో కలిసి తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరంలో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంపాలై జీహెచ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments