Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా: రజనీకాంత్ ప్రకటన

తమిళనాట రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో తమిళ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడును చూస

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (09:54 IST)
తమిళనాట రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో తమిళ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడును చూసి నవ్వుకుంటున్నాయని అన్నారు. ఈ సమయంలో రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాడిగా మిగిలిపోతానని చెప్పారు. తనకు తమిళ ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తెలిపారు. 
 
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. యుద్ధం చేయబోతున్నానని... గెలుపు, ఓటమి భగవంతుడి చేతిలోనే ఉందని తెలిపారు. తనకు రాజకీయాలంటే భయం లేదని, మీడియా అంటేనే భయమని చెప్పారు. 
 
రాజకీయాల్లో గెలిస్తే విజయమని... లేదంటే విరమణ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. కాలమే తన రాజకీయ ఆరంగేట్రాన్ని నిర్ణయించిందన్నారు. రజనీ ప్రకటనతో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటప ప్రాంగణం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది.
 
రాజకీయాల్లోకి వచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రజనీకాంత్ తెలిపారు. ఎవర్నీ విమర్శించడం తమ అభిమతం కాదని, ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీకి మంచి కేడర్, వాచ్ డాగ్స్ కావాలని తెలిపారు. పార్టీకి సంబంధించిన కార్యాచరణను, విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ఇకపై ప్రతి ఎన్నికలో తమ సైన్యం ఉంటుందని, అయితే త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు మాత్రం తమ పార్టీ దూరంగా ఉంటుందని... సమయం చాలా తక్కువ ఉండటంతో, పార్టీని సమాయత్తం చేయడం కష్టమవుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments