Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి వస్తున్నా: తలైవా రజనీకాంత్ ప్రకటన

తమిళనాడులో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఎన్ని సంవత్సరాల పాటు ఊరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లో వస్తున్నానని ప్రకటించారు. తమిళ రాష్ట్ర

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (09:43 IST)
తమిళనాడులో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఎన్ని సంవత్సరాల పాటు ఊరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లో వస్తున్నానని ప్రకటించారు. తమిళ రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అలాగే తమిళనాట పాగా వేసేందుకు, సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆయన షాక్ ఇచ్చారు.
 
రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్... ఢిల్లీ రాజకీయాలపై కూడా విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయాలు నాశనమయ్యాయంటూ పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తారు. రాజులు దండయాత్ర చేసి దోచుకుంటున్నట్టు... ప్రస్తుత రాజకీయ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆధ్యాత్మిక పాలన అందిస్తానని చెప్పారు. పార్టీ ఏర్పాటులో అభిమాన సంఘాలదే కీలక పాత్ర రజనీకాంత్ స్పష్టం చేశారు. 
 
చెన్నైలో అభిమానుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ, డబ్బు కోసమో, పేరు కోసమో తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. కావాల్సినంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే తనకుఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రావడం అనవసరమేనని... కానీ రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments