Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు క్లాసులని అత్యాచారం... గర్భందాల్చడంతో అబార్షన్.. టీచర్ నిర్వాకం

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అదనపు క్లాసుల పేరుతో ఓ విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్, టీచర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ విద్యార్థిని గర్భందాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారు. తాజాగా వ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (09:54 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అదనపు క్లాసుల పేరుతో ఓ విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్, టీచర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ విద్యార్థిని గర్భందాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
రాష్ట్రంలోని శికర్ జిల్లా షహర్ పురాలో నివాసముండే ఓ విద్యార్థినిని అదనపు క్లాసుల పేరుతో స్కూల్ డైరెక్టర్‌ జగదీష్ యాదవ్, టీచర్ జగత్ సింగ్ గుర్జార్‌లు పిలిపించుకునేవారు. ఇద్దరూ కలిసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించేవారు. ఇంట్లో చెబితే తప్పు తనదే అంటారని భయపడ్డ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేకపోయింది.
 
ఈ క్రమంలో విద్యార్థిని గర్భందాల్చింది. దీంతో తాము చిక్కుల్లో పడతామని ఆందోళన చెందిన జగదీష్ యాదవ్, జగత్ సింగ్ గుర్జార్‌లు స్థానికంగా ఆసుపత్రి నడుపుతున్న వైద్య దంపతులు రజ్నీష్ శర్మ, కానన్‌లను సంప్రదించారు. వారు ఆమెకు అబార్షన్ చేసేందుకు అంగీకరించారు. దీంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయడంతో అది వికటించి, ఆమె పరిస్థితి విషమించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల డైరెక్టర్, టీచర్, వైద్యులిద్దర్నీ అరెస్టు చేశారు. రేపిస్టులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయగా, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంపై వైద్యులపై కూడా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం