Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు : ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:54 IST)
తన ఇద్దరు మిత్రుల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పైగా, దేశంలోని వ్యవసాయ వ్యాపారన్నంతా ఆ ఇద్దరు స్నేహితులకు అప్పగించేందుకు ప్రధాని అహర్నిశలు కృషిచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
రాజస్థాన్‌ అజ్మీర్‌ జిల్లా రూపన్‌గఢ్‌లో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ, 'రైతులకు ఆప్షన్లు ఇస్తున్నానని అంటున్నారు. అవి.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు మాత్రమే' అని ఎద్దేవా చేశారు. 
 
కాగా, వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలపై రాహుల్‌ స్పందించారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తమ కుటుంబసభ్యులు ప్రధాని పదవి నిర్వహించారన్నారు. 'నాకో సైద్ధాంతిక దృక్పథం ఉంది. రాజీవ్‌ గాంధీ కొడుకుగా నన్ను చూడొచ్చు. అంతమాత్రాన సిద్ధాంతాల కోసం నేను సాగిస్తున్న పోరును ఎవరూ నిలువరించలేరు' అని ప్రకటించారు. 
 
ఇటీవల కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అవి రైతులకు తీవ్ర హాని కలిగించేలా ఉన్నాయని, దేశంలోని కార్పొరేట్ శక్తులను మేలు చేకూర్చేలా ఉన్నాయంటూ దేశంలోని రైతులు గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments