Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌కు అరేబియా సముద్రాన్ని తీసుకొస్తాం : బీజేపీ హామీ

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (10:32 IST)
రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు నమ్మశక్యంకాని హామీలను గుప్పిస్తున్నారు. 
 
తాజాగా ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వెల్లడించింది. ఇందులో గత 2013 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా వెల్లడించారు. అంటే గత ఎన్నికలకు ముందు మొత్తం 665 హామీలు ఇవ్వగా వాటిలో 630 హామీలు నెరవేర్చినట్టు తెలిపారు. 
 
ఇకపోతే, ప్రస్తుత ఎన్నికల కోసం ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌కు అరేబియా సముద్రాన్ని తీసుకొస్తామంటూ బీజేపీ హామీ ఇచ్చింది. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ రాష్ట్రానికి 'అరేబియా సముద్ర జలాలను తీసుకొస్తాం' అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం రాజస్థాన్‌ వ్యాపారులంతా ఎగుమతుల కోసం దాదాపు 400 కి.మీ. దూరంలో ఉన్న గుజరాత్‌లోని కాండ్లా రేవు మీదే ఆధారపడుతున్నారు. ఈ ఇబ్బంది లేకుండా గుజరాత్‌ మీదుగా రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలోని సాచోర్‌ ప్రాంతానికి అరేబియా సముద్ర నీటికి తీసుకొచ్చి.. ఇక్కడే కృత్రిమ ఓడరేవు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments