Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి వేలాడదీసిన కిరాతకుడు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (15:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 18 యేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు తొలుత అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపేశారు. పిమ్మట చెట్టుకు ఉరేసి వేలాడదీశారు. ఈ దారుణం రాష్ట్రంలోని దుంగాపూర్ జిల్లా సంగ్వారాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత సోమవారం ఈ గ్రామంలో ఓ చెట్టుకు వేలాడుతున్న 18 యేళ్ళ బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో మృతురాలికి ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఆమె కాబోయే భర్తతో మాట్లాడసాగింది. అయితే, ఆ యువతిని ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చిన నిందితుడు ముఖేష్ నానోమా... ఆ యువతి తనకు దక్కలేదన్న కోపంతో హత్య చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడిని కేవలం 20 గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం. 
 
అతనివద్ద జరిపిన విచారణలో ఆ యువతిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ వచ్చాడని, ఆమె మరో వ్యక్తికి దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేక హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపి మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీసినట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments