Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీమా సొమ్ము కోసం హత్య చేయించుకున్నాడు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (13:06 IST)
ఓ వ్యక్తికి చెందిన కుటుంబం పూర్తిగా అప్పులపాలైంది. ఆ అప్పుల నుంచి బయటపడే అవకాశాలేలేకుండా పోయింది. దీంతో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. తాను చనిపోతే వ్యక్తిగత బీమా సొమ్ముతో తన కుటుంబం అయినా కష్టాల కడలి నుంచి గట్టెక్కుతుందని భావించాడు. అంతే.. ఆ బీమా సొమ్ము కోసం హత్య చేయించుకున్నాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన బాల్బీర్ అనే వ్యక్తి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, వ్యాపారంలో ఆదాయం అంతంతమాత్రంగా రావడంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆయన 20 లక్షల రూపాయల మేరకు అప్పులు చేశాడు. పైగా, గత ఆరు నెలల నుంచి కుటుంబ పోషణ మరింత దారుణంగా తయారైంది.
 
దీంతో ఆయనకు దిక్కుతోచలేదు. తనను హత్య చేయించుకుంటే వచ్చే బీమా సొమ్ముతో తన కుటుంబం బాగుపడుతుందని భావించాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఇద్దరు కిరాయి హంతకులను పిలిపించి.. తనను హత్య చేయాలని రూ. 80 వేలు అందజేశాడు. రెండు రోజుల ముందు.. తనను ఎక్కడ హత్య చేయాలో ఆ ప్రాంతాన్ని హంతకులకు చూపించాడు. బాల్బీర్ చెప్పినట్టుగానే కిరాయి హంతకులు ఆయన్ను హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments