Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా వాడిన పాపానికి తమ్ముడినే హత్య చేసిన అన్నయ్య

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (10:32 IST)
స్మార్ట్ ఫోన్ల మోజుతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ సమయం గడిపేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. వస్తు వ్యామోహంలో పడిపోయి బంధాలు, అనుబంధాలను తెంచుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇప్పుడు నిత్యవసరాలుగా మారిపోయాయి.

మొబైల్ ఫోనే లోకంగా గడిపే నేటి యువత అందులో డాటా లేకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. డాటా కోసం తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులతో గొడవలకు దిగుతున్నారు. తాజాగా మొబైల్ డాటా అయిపోగొట్టాడని తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో దారుణం జరిగింది.  
 
వివరాల్లోకి వెళితే.. జోధపూర్‌కు చెందిన రామన్, రాయ్ అన్నదమ్ములు. గత బుధవారం తమ్ముడు రాయ్..అన్న రామన్‌కు తెలియకుండా ఆయన మొబైల్ డేటాను పూర్తిగా వాడుకున్నాడు. దీంతో రామన్ తమ్ముడితో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వివాదం పెద్దదైంది. రాయ్‌ను బిల్డింగ్ పైకి తీసుకెళ్లిన రామన్.. కత్తితో తమ్ముడి ఛాతిలో నాలుగైదుసార్లు బలంగా పొడిచాడు. 
 
దీంతో రాయ్ రక్తం కక్కుకోవడంతో రామన్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాయ్‌ను చూసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రామన్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments