Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌భవన్ నుంచి ప్రేమలేఖ అందింది.. గవర్నరుతో టీ తాగేందుకు వెళ్తున్నా : అశోక్ గెహ్లాట్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (19:27 IST)
రాజస్థాన్ రాజ్ భవన్ నుంచి తనకు ప్రేమ లేఖ అందిందని, ఇపుడు గవర్నరుతో కలిసి టీ తాగేందుకు అక్కడకు వెళుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలంటూ ఆ రాష్ట్ర మంత్రివర్గం చేసిన విజ్ఞప్తిని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ముచ్చటగా మూడోసారి తిరస్కరించారు. 
 
కాగా, ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు పంపించారు. దీన్ని పరిశీలించిన గవర్నరు తిరస్కరించారు.
 
అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నదీ సరైన కారణం చెప్పేందుకు కేబినెట్ తిరస్కరించడం వల్లే ఈ ప్రతిపాదనను వెనక్కి పంపుతున్నట్టు గవర్నర్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పకుంటే 21 రోజుల నోటీసు కోరవచ్చని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు, తనకు మళ్లీ ప్రతిపాదనలు పంవచ్చని సూచించారు.
 
దీనిపై ముఖ్యమంత్రి గెహ్లాట్ స్పందిస్తూ, రాజ్‌భవన్ నుంచి తనకు 'ప్రేమలేఖ' అందిందని, ఇప్పుడు తాను గవర్నర్‌తో కలిసి టీ తాగేందుకు మాత్రమే వెళ్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments