Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీల కళ్లలో కారం కొట్టి.. నిందితుడిని కాల్చి చంపిన దుండగులు

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:55 IST)
ఓ హత్య కేసులోని నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న పోలీసుల వాహనంపై ఓ ముఠా దాడి చేసింది. పోలీసుల కళ్లలో కారం కొట్టి ఆ నిందితులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ నిందితుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 2022లో జరిగిన స్థానిక భాజపా నేత కృపాల్ జఘీనా హత్య కేసులో కుల్దీప్ జఘీనా, విజయ్ పాల్ అనే వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. వీరిని కోర్టులో కోర్టులో హాజరుపరిచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్ రవాణాసంస్థకు చెందిన బస్సులో బయలుదేరారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దండగులు హలేనా పోలీస్ స్టేషను పరిధిలో ఉన్న అమోలీ టోల్లాజా వద్దకు ఓ కారుతోపాటు రెండు బైకులపై వచ్చిన 12 మందికి పైగా సాయుధులైన దుండగలు వచ్చి, బస్సులోకి ప్రవేశించారు. ఎస్కార్టుగా ఉన్న పోలీసులపై కారం చల్లి ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపి పారిపోయారు. 
 
వారిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన నిందితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా కుల్దీప్ జఫీనా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments