Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్రులు పెరిగినా వివాహేతర సంబంధం కొనసాగించింది.. ప్రియుడితో పాటు బలైపోయింది.. ఎలా?

పుత్రులు పెద్దవారైనప్పటికీ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ తల్లి బలైపోయింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఇద్దరు యువకులకు తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చలేదు. తమ తల్ల

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (18:07 IST)
పుత్రులు పెద్దవారైనప్పటికీ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ తల్లి బలైపోయింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఇద్దరు యువకులకు తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చలేదు. తమ తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న తనయులు.. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా కొట్టి చంపేశారు. 
 
ఈ విష‌యాన్ని గుర్తించిన‌ గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ శ్రీగంగానగర్‌ జిల్లాలో గొగామెది గ్రామానికి చెందిన బల్జీత్‌ కౌర్ (39) భర్త లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 
 
తన భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఓ కుమారుడు, కుమార్తెతో బల్జీత్ కౌర్ వేరుగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో ఆమె సుఖ్‌పాల్‌ అనే వ్యక్తితో నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే అమ్మతీరు నచ్చని ఇద్ద‌రు త‌న‌యులు విశాల్‌ సింగ్‌(21), హర్దీప్‌ సింగ్‌(19) ఆమెను, ఆమె ప్రియుడిని గొగామెది గ్రామానికి రప్పించి, పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments