Webdunia - Bharat's app for daily news and videos

Install App

9వ తరగతి విద్యార్థినిపై 12 క్లాస్ మైనర్ బాలుడు అత్యాచారం...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (09:23 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని దుర్గాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 24వ తేదీన బిచివారాలోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి గంట కొట్టారు. అపుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు భోజనం చేయడానికి తరగతి గది నుంచి బయటకు వచ్చింది.
 
అప్పటికే అక్కడ చేరిన 12వ తరగతి బాలుడు ఒకడు ఆ బాలికను బలవంతంగా తన బైకుపై ఎక్కించుకుని స్కూలుకు దూరంగా ఉన్న ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై గంటల తరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం తీసుకొచ్చి ఇంటివద్ద వదలిపెట్టాడు. 
 
అయితే, ఆ బాలికకు రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments