Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్మీర్‌ ఎన్‌హెచ్-8లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:05 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదర్శ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని నేషనల్ హైవే 8పై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం అనంతరం లారీల క్యాబిన్లల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. 
 
ఈ ప్రమాదాన్ని గమనించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక మృతదేహాన్ని వాహనంలో నుంచి బయటకు తీసి జవహర్‌లాల్‌ నెహ్రూ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 
 
మూడు మృతదేహాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఆదర్శనగర్ ఎస్ఐ కన్హయ్య లాల్ పేర్కొన్నారు. ఈ ఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments