Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌డౌన్ అయి ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు... 11 మంది మృతి

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (09:59 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్‌డౌన్ అయి రోడ్డు పక్కన ఆగివున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. అలాగే, మంగళవారం కూడా ఇదే రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
గుజరాత్ నుంచి మధురకు కొందరు ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒకటి జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ అయి రోడ్డుపక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి అమిత వేగంతో వచ్చిన ఓ ట్రక్.. ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న ప్రయాణికుల్లో 11 మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇదే రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments