Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాళ్లు చేతులు, నోరు కట్టేసి బాబాను చంపేశారా?-రాజస్థాన్‌లో దారుణం

crime scene
, సోమవారం, 14 ఆగస్టు 2023 (21:40 IST)
రాజస్థాన్‌లో ఆధ్యాత్మిక గురువు హత్యకు గురయ్యాడు. కుచమన్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని మధ్య-పశ్చిమ భాగంలో ఉన్న ఒక నగరం. మోహన్ దాస్ అనే 72 ఏళ్ల ఆధ్యాత్మిక గురువు రస్సెల్ గ్రామంలో 15 ఏళ్లుగా నివసిస్తున్నారు. 
 
గ్రామంలో బంధువులు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన నిన్న సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడారు. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. ఈరోజు ఉదయం గ్రామస్థులు వెళ్లి చూసే సరికి నేలపై పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు, నోరు బంధించి విగత జీవిగా కనిపించాడు. 
 
అతడి మృతిని చూసి షాక్‌కు గురైన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆశ్రమానికి చేరుకుని ఆధ్యాత్మిక గురువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని రస్సెల్ గ్రామంలో నివసించే బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారి సురేష్ కుమార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజా స్కూల్ యజమానిని తమ్ముడు - మరదలు కలిసి చంపేశారు...