Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులపై రైల్వేశాఖ పెనుభారం, సామాన్యులకు చార్జీల మోత

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (22:15 IST)
కరోనా మహమ్మారి సామాన్యుల జీవనోపాధిని పతనం చేసింది. లాక్ డౌన్‌తో జీవనోపాధి కోల్పోయిన సామాన్యులపై రైల్వేశాఖ మరింత భారం మోపనుంది. ఇప్పటికే టికెట్, ప్లాట్ఫాం టికెట్ చార్జీలను పెంచేసింది. తాజాగా ప్రయాణికులపై యూజర్ చార్జీలను మోపడానికి రంగం సిద్దం చేసింది రైల్వేశాఖ. ఈ మేరకు కేంద్ర సర్కారు వేగంగా అడుగులు వేసింది.
 
మరోవైపు ప్రైవేటీకరణలో భాగంగా పలు రూట్లను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసింది కేంద్రం. దీంతో రైల్వే చార్జీలు సామాన్యులకు మోయలేని పెను భారంగా మారనున్నాయి. రైల్వేశాఖ ప్రతిపాదనలు ప్రకారం యూజర్ చార్జీలను సుమారు 50 రూపాయలు వరకు పెంచవచ్చని సమాచారం. దీనిపై ట్రాఫిక్ డైరెక్టరేట్ తుది కసరత్తు చేస్తున్నది. ముందుగా అభివృద్ధి చేసిన 50 స్టేషన్లలో యూజర్ చార్జీలను అమలు చేయనున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.
 
రైల్వేస్టేషన్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే వసూలు చేయక తప్పదని ఆయన అన్నారు. మరోవైపు ప్రైవేట్ రూట్లలో నడిచే రైళ్లలో టికెట్ ధరలను నిర్ణయించే అధికారం కూడా ప్రైవేట్ యాజమాన్యాలకే అప్పజెప్పేందుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల నిర్ణయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నది సర్కార్ ఆలోచనగా వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments