Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ విదేశాలకు రాహుల్

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:23 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లారు. సోమవారంనాడు ఆయన విదేశాలకు వెళ్లారని, వారం రోజుల పర్యటన ముగించుకుని నవంబర్ మొదటి వారంలో తిరిగి వస్తారని, ఆ వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ మొదటి వారంలో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనూ రాహుల్ విదేశాలకు వెళ్లారు. 

నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకూ కాంగ్రెస్ పార్టీ 35 మీడియా సమావేశాలు నిర్వహించనుంది. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ నవంబర్ 5 నుంచి 15 వరకూ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకూ జరిపే మీడియా సమావేశాల్లో పార్టీ సీనియర్ నేతలు మాట్లాడనున్నారు.

అలాగే, ఢిల్లీలో భారీ ప్రదర్శనను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఈ ప్రదర్శనకు విపక్షాలను కూడా ఆహ్వానించనున్నారు. జిల్లాల్లోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ నిరసనలు నిర్వహించి, చివరిగా దేశరాజధానిలో జరిగే భారీ ప్రదర్శనతో వీటిని ముగిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈనెల 23న ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments