బైక్ మెకానిక్‌గా అవతారమెత్తిన రాహుల్ ... కార్మిక చేతులతో భారత్ నిర్మాణం

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (10:32 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ మెకానిక్ అవతారమెత్తారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ఓ బైక్ మెకానిక్ షాపుకు వెళ్లిన ఆయన.. అక్కడ మెకానిక్‌గా మారిపోయారు. అలాగే, మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులు, మెకానిక్‌లతో ముచ్చటించి వారితో కరచాలనం చేశారు. ఈ కార్మిక చేతులే భారత్‌ను నిర్మిస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 
 
కరోల్‌లోని ఓ మెకానిక్ షాపులో ఉన్నట్టుండి ప్రత్యక్షమైన రాహు్ల్ గాంధీ.. అందులో పని చేసే బైక్ మెకానిక్‌లతో మాట్లాడుతూ, బైక్ మెకానిక్ ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు. సైకిల్ మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులతో ముచ్చటించారు. వీటికి సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెంచీలను తిప్పుతూ మన దేశ చక్రాలు ముందుకు సాగేలా చేస్తున్న వారి నుంచి ఎంతో నేర్చుకున్నట్టు చెప్పారు.
 
ఈ కార్మికుల చేతులో భారత్‌ను నిర్మిస్తాయని రాహుల్ అన్నారు వారి బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం ఆత్మాభిమానమని చెప్పారు. ప్రజల నాయుకుడు మాత్రమే వారిని ప్రోత్సహిస్తాడని అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments