Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి వారంటే భయం.. అందుకే అయోధ్యకు రాలేదు..

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (15:57 IST)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ముస్లిం నేతలంటే భయమని అందుకే ఆయన అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం లేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ అన్నారు. రాహుల్ గాంధీ రామమందిరాన్ని ఎందుకు సందర్శించడం లేదని వాయనాడ్‌లోని రామభక్తులు అడగడం ప్రారంభించారు. రాహుల్ సెక్యులరిజం ఏకపక్షమని ఇప్పుడు రుజువైంది. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, జమాతే ఇస్లామీ, ఎస్‌డిపిఐలకు భయపడి రామమందిరాన్ని సందర్శించడం లేదని సురేంద్రన్‌ వాయనాడ్‌లోని కల్‌పేటలో మీడియాతో అన్నారు. 
 
ఏప్రిల్ 26 తర్వాత రాహుల్ గాంధీ రామమందిరాన్ని సందర్శించవచ్చని సురేంద్రన్ అన్నారు. రాహుల్ గాంధీ సోమవారం వాయనాడ్‌లో నామినేషన్‌ దాఖలు చేస్తారని చెప్పారు. 
 
భారత రాష్ట్రపతిని కాంగ్రెస్ ఎందుకు అపహాస్యం చేస్తోంది? రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న వాయనాడ్ నియోజకవర్గంలో దాదాపు 20 శాతం షెడ్యూల్డ్ తెగలు ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రపతిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. 
 
అరవింద్ కేజ్రీవాల్‌పై కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్నాయని, అయితే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అతని కుమార్తెపై ఈడీ దర్యాప్తు చేస్తే వారు అదే చేస్తారా? అంటూ కె.సురేంద్రన్ ప్రశ్నల వర్షం కురిపించారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments