Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడ చూసినా డబ్బే.. రూ.35.50 లక్షలతో కూడిన బ్యాగ్ స్వాధీనం

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (15:12 IST)
తెలంగాణలో భారీ లక్షల నగదు ఎన్నికల వేళ పట్టుబడుతోంది. తాజాగా ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.37,50,000 నగదు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహేష్ ఎం భగవత్, ఐపీఎస్, రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీపీ, సాయేశ్వర్ గౌడ్, ఐఆర్పీ/ఎస్సీ తన సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాధారణ ఎంపీ ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించారు. 
 
తనిఖీల సమయంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.01లోని మిడిల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గేట్ నంబర్ 03 దగ్గర బ్యాగ్‌తో తమిళనాడులోని మధురాంతకం, కాంచీపురంకు చెందిన పి లక్ష్మణ్ రామ్ (45) అనే వ్యక్తిని వారు పట్టుకున్నారు. 
 
నికర నగదు రూ.37,50,000/- ఉన్న అతని బ్యాగ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విచారణలో అతను సరైన పత్రాలను కలిగి వుండలేదు. ఇంకా ఆ నగదు గురించి సరైన సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ నగదును తదుపరి చర్యలు తీసుకోవడానికి సరైన రసీదు కింద ఆదాయపు పన్ను శాఖ, ఆయకార్ భవన్, హైదరాబాద్‌కు అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments