ఎక్కడ చూసినా డబ్బే.. రూ.35.50 లక్షలతో కూడిన బ్యాగ్ స్వాధీనం

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (15:12 IST)
తెలంగాణలో భారీ లక్షల నగదు ఎన్నికల వేళ పట్టుబడుతోంది. తాజాగా ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.37,50,000 నగదు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహేష్ ఎం భగవత్, ఐపీఎస్, రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీపీ, సాయేశ్వర్ గౌడ్, ఐఆర్పీ/ఎస్సీ తన సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాధారణ ఎంపీ ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించారు. 
 
తనిఖీల సమయంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.01లోని మిడిల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గేట్ నంబర్ 03 దగ్గర బ్యాగ్‌తో తమిళనాడులోని మధురాంతకం, కాంచీపురంకు చెందిన పి లక్ష్మణ్ రామ్ (45) అనే వ్యక్తిని వారు పట్టుకున్నారు. 
 
నికర నగదు రూ.37,50,000/- ఉన్న అతని బ్యాగ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విచారణలో అతను సరైన పత్రాలను కలిగి వుండలేదు. ఇంకా ఆ నగదు గురించి సరైన సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ నగదును తదుపరి చర్యలు తీసుకోవడానికి సరైన రసీదు కింద ఆదాయపు పన్ను శాఖ, ఆయకార్ భవన్, హైదరాబాద్‌కు అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments