మీరు బీజేపీ జర్నలిస్టు.. ప్రెస్‌మెన్‌గా నటించవద్దు: రాహుల్ గాంధీ ఫైర్

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (19:38 IST)
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కారణంగా లోక్‌సభలో అనర్హత వేటుకు గురైన నేపథ్యంలో, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ తన సాధారణ వాక్చాతుర్యాన్ని ప్రస్తావిస్తూ, దేశాన్ని పీడిస్తున్న 'అసలు' సమస్యల నుండి భారతదేశ ప్రజలను మరల్చడానికి బీజేపీ తన నేరారోపణను, తదుపరి దిగువ సభ నుండి అనర్హత వేటుకు పాల్పడిందని ఆరోపించారు. 
 
సదస్సు సందర్భంగా, 'మోదీ ఇంటిపేరు' కేసులో దోషిగా తేలడం గురించి తనను ప్రశ్నించిన విలేకరిపై రాహుల్  గాంధీ విరుచుకుపడ్డారు. ఆ జర్నలిస్టును 'బీజేపీ జర్నలిస్టు' అని పేర్కొన్న రాహుల్ గాంధీ.. 'ప్రెస్‌మెన్‌గా నటించవద్దు' అని మండిపడ్డారు. 
 
రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటుకు గురైన మరుసటి రోజు తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. సహనం కోల్పోయిన రాహుల్ బీజేపీపై విమర్శలు గుప్పించేందుకు వెనుకాడలేదు. 
 
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికార పార్టీ న్యాయ వ్యవస్థను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అంటూ రాహుల్ గాంధీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments