Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీని హత్య చేయించిందీ ఆర్ఎస్ఎస్‌నే.. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను : రాహుల్ గాంధీ

జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేయించిందీ ఆర్ఎస్ఎస్ అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన బుధవ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (13:45 IST)
జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేయించిందీ ఆర్ఎస్ఎస్ అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన బుధవారం మహారాష్ట్రలోని భివాండీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు.
 
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహాత్మ గాంధీని హత్య చేయించింది ఆర్ఎస్ఎస్ అని వ్యాఖ్యానించడంపై ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిమిత్తం ఆయన భివాండీ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని కోర్టుకు రాహుల్ తెలిపారు. దీంతో కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసిన న్యాయస్థానం, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 
 
అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం పెద్ద నోట్లను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, దానికి అందరం సంతోషిద్దామని, అయితే కేంద్రం చెబుతున్న నల్లధనం ఎవరి వద్ద ఉందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెబుతున్నట్టు నల్లధనం ఉన్నవారెవరైనా ఈ ఎనిమిది రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టారా? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఎవరూ కనిపించలేదని ఆయన చెప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.
 
అధికారం కట్టబెట్టిన ప్రజలను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన అడిగారు. దేశ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోమని రాహుల్ హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments