Webdunia - Bharat's app for daily news and videos

Install App

72వ గణతంత్ర ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ ట్యాంక్‌ టీ-90 భీష్మ

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (12:35 IST)
T-90 Bhishma
దేశ 72వ గణతంత్ర ఉత్సవాల్లో సైనిక దళాలు తమ సైనిక పాటవాన్ని చాటాయి. శత్రువులకు వెన్నులో చలిపుట్టించే ట్యాంకులు, క్షిపణులు, మల్టీ లాంఛర్ రాకెట్ సిస్టమ్‌లను ప్రదర్శించారు. ఇండియన్ ఆర్మీ ప్రధాన యుద్ధ ట్యాంక్‌ టీ-90 భీష్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 54వ సాయుధ రెజిమెంట్‌కు చెదిన కెప్టన్ కరణ్‌వర్ సింగ్ భంగూ ఈ ట్యాంక్‌ను ప్రదర్శించారు. కెప్టెన్ ఖమ్రుల్ జమాన్ నేతృత్వంలో బ్రహ్మోస్ క్షిపణి సిస్టంను ప్రదర్శించారు. 
 
భారత్-రష్యా సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి. 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని బ్రహ్మోస్ క్షిపణలు ఛేదించ గలవు. పినాకా మల్టీ లాంఛర్ రాకెట్ సిస్టమ్‌ ప్రదర్శనకు 841 రాకెట్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ విభోర్ గులాటీ సారథ్యం వహించారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ లాంఛర్ సిస్టమ్. తక్కువ సమయంలోనే ఈ రాకెట్ ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
 
కాగా, అప్‌గ్రేడెడ్ షిల్కా వెపన్ సిస్టమ్‌కు 140 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ ప్రీతి చౌదరి సారథ్యం వహించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆర్మీ నుంచి పాల్గొన్న ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్ ప్రీతి చౌదరి కావడం విశేషం. అధునాతన రాడార్, డిజిటల్ ఫైర్ కంప్యూటర్లతో షిల్కా వెపన్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments