సహ వైద్యుల వేధింపులు... రేడియాలజీ డాక్టర్ సూసైడ్

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:42 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేడియాలజీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. తాను చనిపోతూ ఓ సూసైడ్ లేఖను రాసిపెట్టింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రిలో పూనమ్ వోహ్రా (52) రేడియాలజీ డాక్టర్‌గా పనిచేస్తోంది. తనకు ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో భర్త చిరంజీవి వోహ్రా, పిల్లలతో పాటు ఉంటున్నారు. 
 
ఆమె 2016లో ఆర్ఎంఎల్‌లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌గా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం భర్త పిల్లలు బయటకు వెళ్లిన సమయం చూసి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత పొరుగువారు తలుపు తట్టగా ఎంతకు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని గమనించారు. అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డిఎస్పీ మధుర్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ వోహ్రా సూసైడ్ నోట్‌లో తాను పనిచేస్తున్న ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు తనను వేధిస్తున్నారని రాసివుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేధిస్తున్నారని ఆరోపించిన ముగ్గురు వైద్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments