Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగు నీటి గుంతలో పడి రేడియో మిర్చి ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది...

ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, రహదారులపై తగిన హెచ్చరిక గుర్తులు లేకపోవడం వల్ల వాహనచోదకులు సైతం ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.

Radio Station Employee
Webdunia
బుధవారం, 2 మే 2018 (15:38 IST)
ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, రహదారులపై తగిన హెచ్చరిక గుర్తులు లేకపోవడం వల్ల వాహనచోదకులు సైతం ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా, మురుగు నీటి గుంతలో పడి రేడియే మిర్చిలో పని చేసే ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే...
 
రేడియో మిర్చి మార్కెటింగ్ టీమ్‌లో పని చేస్తున్న తాన్యా ఖన్నా (26) మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో నోయిడాలోని సెక్టర్ 94 రోడ్డులో కారులో వెళుతుండగా, అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మురుగు నీటిగుంతలో పడిపోయింది. ఆమె తన వెర్నా కారుతో సహా ఈ గుంతలో బోల్తాపడింది. ఆమె ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఓ కారు వేగంగా మురికి నీటి గుంతలోకి దూసుకెళ్ళిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments