Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రవ్యోల్బణం విపత్తుగా మారితే తినడం - తాగడం మానేయండి : బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (07:53 IST)
చత్తీస్‌ఘర్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్ మోహన్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నానాటికీ ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై బ్రిజ్ మోహన్ అగర్వాల్ తనదైనశైలిలో స్పందించారు. దేశంలో ద్రవ్యోల్బణం విపత్తు స్థాయికి చేరితే తినడం, తాగడం మానేయ్యాలని కోరారు. 
 
అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో తాను సరదాగా అన్న మాటలను వక్రీరిస్తున్నారని మాట మార్చారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయగా, దానిపై స్పందన ఏంటని అగర్వాల్‌ను ప్రశ్నించగా పైవిధంగా వ్యాఖ్యానించారు.
 
'ద్రవ్యోల్బణం జాతీయ విపత్తు స్థాయికి పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంత తీవ్ర స్థాయిలో ఉంటే తినడం, తాగడం ఆపేయండి. అలాగే పెట్రోల్ వాడకం కూడా ఆపేయండి. కాంగ్రెస్ ఏదో అద్భుతాలు చేస్తుందని ప్రజలు ఓటేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో అలాగే తగ్గుతుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అంటూ అగర్వాల్ వ్యాఖ్యానించారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే అగర్వాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా స్పందిస్తూ 'దేశం కష్టాల్లో ఉంటే, ఎమ్మెల్యే హేళన చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు' అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments