Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై క్వీన్స్‌లాండ్‌లో ఫ్రీ ఫాల్ టవర్ ఊడిపడింది...(video)

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (15:05 IST)
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని క్వీన్స్ లాండ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో రాట్నం తెగి పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలైనారు. వివరాల్లోకి వెళితే.. పూందమల్లికి తర్వాత పళంజూర్ ప్రాంతానికి చెందిన ఈ పార్కులో రాట్నం తెగి పడి ప్రమాదానికి గురైంది. ఈ పార్కులో ''ఫ్రీ ఫాల్ టవర్'' అనే రైడ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ పార్కుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ రైడ్‌ అంటే చాలామంది ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ రాట్నంలో ప్రజలు ఎక్కారు. రాట్నంలో ఆడుకుంటుండగా.. రాట్నంలోని ఇనుము కమ్మీలు తెగి కిందపడ్డాయి. 
 
ఈ ప్రమాదం రాట్నం కిందికి దిగుతుండగా జరగడంతో ప్రజలు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ పార్కును మూతపెట్టాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments