Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్కుల పవిత్ర పతాకాన్ని అపవిత్రం చేశాడనీ.. వ్యక్తిని కొట్టి చంపేసారు...

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (15:57 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సిక్కుల పవిత్ర పతాకమైన నిషాన్ సాహిబ్‌ను అపవిత్రం చేశాడన్న అక్కసుతో ఓ వ్యక్తిని కొందరు సిక్కులు కొట్టి చంపేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. 
 
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో శనివారం రాత్రి ఓ వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెల్సిందే. గర్భగుడిలోకి ప్రవేశించి బీభత్స సృష్టించినందుకు ఆ యువకుడిపై కొందరు సిక్కు భక్తులు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పంజాబ్‌లో అదే తరహాలో ఘటన జరిగింది. 
 
పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా నిజాంపూర్ గ్రామంలో ఓ గురుద్వారాలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, సిక్కుల పవిత్ర జెండా నిషాన్ సాహిబ్‌ను అపవిత్రం చేస్తూ కొందరు సిక్కుల కంటపడ్డారు. ఇంతలో అక్కడకు వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
కానీ, ఆ వ్యక్తిని తమ ఎదుటే విచారించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై గ్రామస్థులు దాడి చేయడంతో ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. అమృతసర్‌లో ఓ ఘటన జరిగిన 24 గంటల్లోనే పంజాబ్‌లో ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments