Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య - కేరళలో ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (14:42 IST)
కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. కేవలం 12 గంటల వ్యవధిలో వీరిద్దరినీ కొందరు దండగులు చంపేశారు. మృతుల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్, బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్‌లు ఉన్నారు. వీరిలో ఒకరు శనివారం రాత్రి, మరొకరు ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. 
 
కేఎస్ షాన్ శనివారం రాత్రి తన విధులు ముగించుకుని పార్టీ ఆఫీస్ నుంచి వెళుతుండగా, కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన బైక్‌ను ఢీకొట్టారు. దీంతో ఆయన కిందపడిపోవడంతో ఆ తర్వాత ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే బీజేపీ నేతను హత్య చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు రంజిత్ ఇంట్లోకి చొరబడిమరీ హత్య చేశారు. దీంతో కేరళ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హత్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments