గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య - కేరళలో ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (14:42 IST)
కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. కేవలం 12 గంటల వ్యవధిలో వీరిద్దరినీ కొందరు దండగులు చంపేశారు. మృతుల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్, బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్‌లు ఉన్నారు. వీరిలో ఒకరు శనివారం రాత్రి, మరొకరు ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. 
 
కేఎస్ షాన్ శనివారం రాత్రి తన విధులు ముగించుకుని పార్టీ ఆఫీస్ నుంచి వెళుతుండగా, కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన బైక్‌ను ఢీకొట్టారు. దీంతో ఆయన కిందపడిపోవడంతో ఆ తర్వాత ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే బీజేపీ నేతను హత్య చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు రంజిత్ ఇంట్లోకి చొరబడిమరీ హత్య చేశారు. దీంతో కేరళ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హత్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments