అదృశ్యమైన అక్కా చెల్లెళ్లు.. ఇంట్లోని పెట్టెలోనే విగతజీవులుగా..

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (16:17 IST)
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కనిపించకుండా పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే ఓ పెట్టెలో విగత జీవులుగా పడివున్నారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముద్దు ముద్దు మాటలతో సందడి చేసే చిన్నారులు కాంచన (4), శక్తి (7), అమృత (9) ఇక తమ మధ్య లేరన్న వార్తతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. 
 
పోలీసుల వెల్లడించిన కథనం మేరకు.. జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు ఐదుగురు సంతానం. ఆదివారం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ముగ్గురు కుమార్తెలు కనబడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ భార్యాభర్తలు మక్సుదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
అయితే, సోమవారం ఇంట్లోని వస్తువులను ఆ చిన్నారుల తండ్రి వేరే చోటకు తరలిస్తున్న సమయంలో ట్రంకు పెట్టె సాధారణం కన్నా అధిక బరువు ఉండటం గర్తించారు. దాన్ని తెరిచి చూడగా ఆ పెట్టెలో ముగ్గురు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ చిన్నారుల తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో ఇంటిని ఖాళీ చేయాలని ఇటీవలే ఇంటి యజమాని హుకుం జారీ చేశాడని పోలీసులు తెలిపారు. చిన్నారులు మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మరణాలకు కారణాలను తెలుసుకొనేందుకు వీరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments