Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో కుక్క.. పంది... బర్రెలు ఉన్నాయా.. అయితే పన్ను చెల్లించాల్సిందే.. ఎక్కడ?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం... ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (15:43 IST)
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం... ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే, పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టింది. అయితే, ఈ రాష్ట్రంలో ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. 
 
ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ ఉత్తర్వుల మేరకు పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు జంతువైనా ఇంట్లో ఉన్నట్టయితే పన్ను కట్టాల్సిందే. పంచాయతీలను మాత్రం ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు. జంతువులను బట్టి రూ.200 నుంచి రూ.500వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 
 
ఒకవేళ పన్ను కట్టకపోతే... మున్సిపల్ సిబ్బంది ఆ జంతువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే, కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు కూడా పన్ను వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ పన్ను విధింపు ఉత్తర్వులపై పంజాబ్ రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం