Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (10:25 IST)
పంజాబ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.
 
అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అమృతసర్‌లోని మజితా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్యలు తీసుకుని ప్రధాన నిందితుడైన ప్రబ్జీత్‌ సింగ్‌తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో సహబ్ సింగ్ అనే మరో నిందితుడి పేరు వెల్లడైంది. 
 
అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడి నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇదే మద్యం తాగిన మరికొంతమందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం తయారీదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసుపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments