Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్ళ గొడవ : తండ్రి అండతో నానమ్మను హత్య చేసిన మనవడు

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (15:47 IST)
అత్తాకోడళ్ళ మధ్య గొడవ జరిగింది. దీంతో తండ్రీ తనయులు కలిసి ఓ దారుణానికి పాల్పడ్డారు. తండ్రి అండతో మనవడు నానమ్మను కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని కేశవ్ నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. కేశవ్ నగరుకు చెందిన ఉషా విఠల్ గైక్వాడ్ (64) దేహురోడ్‌లోని ఆర్మీ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. ఆమె పదవీ విరమణ తర్వాత కేశవ్ నగరులో స్థిరపడ్డారు. ఇంటో ఆమెతో పాటు కుమారుడు సందీప్ గైక్వాడ్ (45), కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ (20)లు ఉంటున్నారు. అయితే, అత్తాకోడళ్ల మధ్య  తరచూ గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ క్రమంలో గత నెల 5వ తేదీన మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు మధ్యాహ్న ఉష విఠల్ ఇంట్లో నిద్రపోతుండగా మనవడు సాహిల్ ఆమెను స్నానాల గదిలోకి లాక్కెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు తన తండ్రితో కలిసి అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశాడు. 
 
చెట్లను నరికే ఎలక్టిర్క కట్టర్‌తో వృద్ధురాలి శరీరాన్ని తొమ్మిది ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను మూటల్లో కుక్కి కుట్టేశారు. ఆ బ్యాగులను కారులో తీసుకెళ్లి ముథా నదిలోని నీటిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగును వదిలివేశారు. ఆ తర్వాత వృద్ధురాలి పేరుతో మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అయితే, తన మృతి కేసులో అన్న సందీప్‌పై చెల్లికి అనుమానం వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో తల్లిని చంపేందుకు సహకరించిన సందీప్‌తో పాటు అతని కుమారుడు సాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments