Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా డాక్టర్‌ను చంపేసిన గాలిపటం దారం... ఎలా?

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:16 IST)
గాలిపటం (పతంగు) దారం ఓ మహిళా డాక్టర్ ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెలోని భోసరీ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ళ ఒక మహిళా డాక్టర్ ద్విచక్రవాహనంపై తాను పని చేసే ఆస్పత్రికి విధులకు హాజరయ్యేందుకు వెళుతోంది.
 
ఆ సమయంలో కొందరు చిన్నపిల్లలు గాలిపటాలను ఎగురవేస్తున్నారు. అలా ఓ గాలిపటం దారం (మాంఝె)ఆమె గొంతుకు చుట్టుకుంది. మెడకు దారం చుట్టుకున్న వెంటనే డాక్టర్ కింద పడిపోయారని, ఆమె మెడ నుంచి తీవ్ర రక్తస్రావమైందన్నారు. 
 
ఆమెను సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారని పోలీసులు తెలిపారు. కాగా ఈ మహిళా డాక్టర్ పూణెలోని పింపల్ సౌదాగర్ ప్రాంతంలో ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments