Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శవానికి మూడు రోజులు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు... ఎక్కడ?

తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆస్పత్రి ప్రాణాలు కోల్పోయిన ఓ మృతదేహానికి మూడు రోజుల పాటు చికిత్స చేశారు. ఇది అచ్చం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశాన్ని తలపించింది.

Advertiesment
Tamil Nadu
, ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (12:01 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆస్పత్రి ప్రాణాలు కోల్పోయిన ఓ మృతదేహానికి మూడు రోజుల పాటు చికిత్స చేశారు. ఇది అచ్చం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశాన్ని తలపించింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తమిళనాడు నాగపట్టణం జిల్లాలోని తంజావూర్ ఆసుపత్రిలో ఎన్.శేఖర్ (55) అనే వ్యక్తి చనిపోయాడు. అయినప్పటికీ ఆయనకు మూడు రోజుల పాటు చనిపోయాడు. మూడు రోజుల పాటు వైద్యులు చికిత్స చేశారు. దీనిపై స్పందిస్తూ, మృతుని కుమారుడు స్పందిస్తూ, తన తండ్రి చనిపోయి మూడు రోజులైంది. ఆస్పత్రి వైద్యులు మాత్రం చనిపోయినట్టుగా చెప్పలేదు. పైగా, తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగితే ఇంకా వైద్యం చేస్తూనే ఉన్నామని బదులిచ్చారని ఆయన కుమారుడు సుభాష్ తెలిపారు.
 
సుభాష్ కథనం ప్రకారం.. సెప్టెంబరు 9న శేఖర్ కడుపునొప్పితో నాగపట్టణంలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అక్కడి నుంచి తంజావూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి రెఫర్ చేశారు. సెప్టెంబరు 10న శేఖర్‌ను అక్కడికి తరలించారు. ఆసుపత్రి యాజమాన్యం తొలుత రూ.5 లక్షలు కట్టించుకుంది. చికిత్స కొనసాగించేందుకు మరో రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా శుక్రవారం బాధిత కుటుంబాన్ని కోరింది.
 
ఇక తమ వద్ద డబ్బు లేకపోవడంతో, శేఖర్‌ను తంజావూర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఆయన చనిపోయి మూడు రోజులు అయిందని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. దీంతో శుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
ఆసుపత్రి యాజమాన్యం తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేఖర్ మృతి చెందిన విషయాన్ని చెప్పాల్సింది పోయి ఇంకా ఫీజు అడగడం దారుణమని సీపీఐ ఎమ్మెల్యే జి.పళనిస్వామి అన్నారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శేఖర్ మూడు రోజుల క్రితమే మరణించినట్టు పోస్టుమార్టంలో తేలితే ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరకు ఎమ్మెల్యే కిడారిని నమ్మకస్థులే పట్టించారా?