Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడిలో భర్త మృతి... లెఫ్టినెంట్‌గా భార్య బాధ్యతలు...

Webdunia
శనివారం, 29 మే 2021 (17:46 IST)
martyr Major Dhoundiyal's wife
జమ్ము-కాశ్మీర్‌లోని పుల్వామాలో 2019లో జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ అమరులయ్యారు. అప్పటికీ ఆయనకు వివాహం జరిగి 9 నెలలే అవుతోంది. 27 ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన భార్య నిఖిత కౌల్‌ను చూసి అందరూ బాధపడ్డారు. ఆమె మాత్రం జాలి కాదు.. గర్వపడమని చెప్పారు. అంతేకాదు భర్త మీద ప్రేమతో ఆయన బాధ్యతను పంచుకున్నారు.
 
ఢిల్లీలో ఎంఎన్‌సీ ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. తన భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలోనే సీటు సాధించి శిక్షణ తీసుకున్నారు. శనివారం లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి నైన్యంలోకి తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె తన భర్తను గుర్తుచేసుకున్నారు. తన ప్రయాణం ఇప్పుడే మొదలైందన్నారు. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని తాను కొనసాగించనున్నట్లు తెలిపారు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఐ లవ్ యూ విభూ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments