Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసమే మా పోరాటం : ప్రియాంకా గాంధీ

ఠాగూర్
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (11:21 IST)
తమ కుటుంబం దేశం కోసం పోరాటం చేస్తున్నామని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ఒకరిద్దరు తమ వ్యాపార మిత్రులకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ, 'ఏ వ్యవస్థలపై ఈ దేశ నిర్మాణం జరిగిందో ఆ వ్యవస్థలను అధికారంలో ఉన్న వారు నాశనం చేస్తున్నారు. అందుకే దేశం కోసం మేం పోరాటం చేస్తున్నాం' అని అన్నారు. వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిచేయి చూపాయని దుయ్యబట్టారు.
 
మరోవైపు, కొద్ది మంది కుబేరులే లబ్ధి పొందున్నంత కాలం దేశం ప్రగతి సాధించ లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిం చారు. ఒకవైపు అభివృద్ధి ఫలాలు కొద్ది మంది కోటీశ్వరులే అందుకుంటూ మరోవైపు ఆర్థిక విపత్తుల కారణంగా రైతులు, కార్మికులు, మధ్యతర గతి ప్రజలు జీవనం కోసం పోరాడుతుంటే అది ప్రగతి అనిపించుకోదన్నారు. జీడీపీ వృద్ధి బాగా తగ్గినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments