Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరులో ర్యాగింగ్.. ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (13:37 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. సీనియర్ల రూపంలో కన్నూమిన్నూ గానకుండా ఓ జూనియర్లపై దాష్టీకానికి దిగింది. తమ తోడివాడేనన్న ఇంగితాన్ని మరచిన ఏడుగురు సీనియర్లు ఓ జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో అతనిపై దాడి చేయడంతో పాటు నగ్నంగా నిల బెట్టి గుండుగీశారు. ఆ దృశ్యాలను వీడియో తీశారు. అంతేగాకుండా వేకువజాము వరకు ఆ విద్యార్థిని చిత్ర హింసల పాల్లేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో కళాశాల యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. 
 
అంతేగాక యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఏడుగురినీ అరెస్టు చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టాలు, హత్యా బెదిరింపు, అసభ్య దూషణ తదితర ఆరు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి... కోవై అవినాశిరోడ్డులో నడుస్తున్న పాలిటెక్నిక్ తిరుప్పూర్ జిల్లా రాయర్పాలెంకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధవన్, మణి, వెంకటేష్, తరణీధరన్, అయప్పన్, సంతోష్, యాలీస్ గత కొంతకాలంగా మొదటి సంవత్సరం విద్యార్థిపై వేధింపులకు పాల్పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ రాత్రి మొదటి సంవత్సరం విద్యార్థి గదిలోకి వచ్చి తమకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అతను నిరాకరించడంతో తమ గదిలోకి రావాలని పిలిచారు. వారి ఉద్దేశాన్ని గ్రహించిన ఆ విద్యార్థి.. వారితో వెళ్లేందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహించిన సీనియర్లు... జూనియర్‌ని బలవంతంగా ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతనిపై దాడి చేశారు. నగ్నంగా మార్చి, గుండు గీశారు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. అనంతరం వేకువజాము వరకూ అతన్ని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తా మంటూ బెదిరించారు. దాంతో ఆ విద్యార్థి భయపడి ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. 
 
అయితే సీనియర్లు చిత్రీకరించిన వీడియో దృశ్యాలు బయటకు రావడంతో అసలు విషయాన్ని గ్రహించిన కళాశాల యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆ ఏడుగురినీ సస్పెండ్ చేసింది. అనంతరం పీలమేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఏడుగురినీ అరెస్టు చేశారు. ఇదిలావుంటే ఈ విషయంపై రాష్ట్రప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ గీత.. ర్యాగింగ్‌ను సహించేది లేదని, ఇలాంటి వ్యవహారంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాగిం‍‌గ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్ని కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments