Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక పెరోల్​పై బయటకు రానున్న ఖైదీలు!

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (22:17 IST)
దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోన్న సమయంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఖైదీలకు స్పెషల్​ పెరోల్​ ఇవ్వాలని నిర్ణయించి.. ఇందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టుకు విన్నవించింది. దేశంలో క్రమంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్​ నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను బయటకు పంపేందుకు నిర్ణయం తీసుకుంది దిల్లీ సర్కారు. ఈ మేరకు జైళ్లలోని ఖైదీలకు స్పెషల్​ పెరోల్​ ఇవ్వాలని సంకల్పించింది. ఇందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఈ ప్రత్యేక పెరోళ్ల నిబంధన.. ఖైదీలకు అమలు చేసేందుకు వీలుగా జైలు నియమాలను సవరించనున్నట్లు జస్టిస్​ హిమా కోహ్లీ, జస్టిస్​ సుబ్రహ్మణ్యం ప్రసాద్​ల ధర్మాసనానికి నివేదించింది కేజ్రీవాల్ సర్కారు.

ప్రస్తుత నిబంధనలకు అదనంగా రెండు అంశాలను చేరుస్తూ సవరణ చేయనున్నట్లు.. కోర్టుకు నివేదించారు దిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అనూజ్ అగర్వాల్. ఒకరోజులో నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రత్యేక పెరోల్​కు సుప్రీం గతంలో అనుమతించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. ఏదైనా అంటువ్యాధి, ప్రకృతి విపత్తు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 60 రోజుల పెరోల్​ నిబంధన వర్తిస్తుందని అగర్వాల్​ ధర్మాసనానికి గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం