Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌

Webdunia
శనివారం, 8 మే 2021 (17:07 IST)
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌లతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కోవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి వ్యాప్తి కట్టడికై తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు.
 
ప్రధాని మోదీకి ధన్యవాదాలు: ఉద్ధవ్‌ ఠాక్రే
కరోనా సెకండ్‌వేవ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోంటందన్న అంశంపై ప్రధాని మోదీ వివరాలు కోరారు. కోవిడ్‌-19 కట్టడికై ఎలాంటి చర్యలు చేపడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. ఆక్సీజన్‌ కొరత లేకుండా సహాయం అందించాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న తీరును వివరించారు. ఎప్పటికప్పుడు కోవిడ్‌ పరిస్థితిపై సమీక్ష జరుపుతూ విలువైన సూచనలు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను మన్నిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments