Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సర్కారు జీవో .. సుమోటాగా స్వీకరించిన ప్రెస్ కౌన్సిల్

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (06:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాను కట్టడి చేసే విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు జీవో నెంబర్ 2430 అమలుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై మీడియా సంస్థలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దుర్మార్గపు జీవో అని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవో 2430 వివాదాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. 
 
జీవోపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. ఈ జీవో పాత్రికేయుల విధి నిర్వహణకు, మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని అభిప్రాయపడింది. 
 
మరోవైపు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, శ్రీరామచంద్రమూర్తిలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 938 జీవో తీసుకువస్తే అది పత్రికా స్వేచ్ఛకు ఉరిత్రాడు అని ఉద్యమం చేపట్టిన అమర్, శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు నోరెత్తకపోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించారు.
 
ముఖ్యమంత్రి విసిరిన పదవుల కారణంగానే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారా? అని నిలదీశారు. ఎంతటివాళ్లనైనా అధికారం లొంగదీస్తుంది కదా! అంటూ విస్మయం వ్యక్తం చేశారు. కాగా, దేవులపల్లి అమర్‌ను ఏపీ సర్కారు ప్రభుత్వ జాతీయ, అంతర్రాష్ట్ర మీడియా సలహాదారుగా, శ్రీరామచంద్రమూర్తిని ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments