Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ప్రారంభిస్తారు? రాహుల్ ప్రశ్న

Webdunia
సోమవారం, 22 మే 2023 (10:35 IST)
దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదని, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండడంపై ట్విటర్ వేదికగా రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధానిని కలిసి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. దీంతో రాహుల్‌తో పాటు అనేక విపక్ష నేతలు తమ నిరసన గళం వినిపించారు.

'కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగబద్ధం కాదు. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్‌కు రాష్ట్రపతే అధిపతి. కాబట్టి దానిని రాష్ట్రపతి ప్రారంభించాలి' అని కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడు ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ను ప్రధాని ప్రారంభించమేంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే ప్రారంభించడం సముచితమని సీపీఐ జాతీయ నేత డి.రాజా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments